ఏం మాయ చేసావే సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతో నే మంచి హిట్ అందుకుంది. అలాగే నాగచైతన్య కూడా హీరోగా తొలి విజయం అందుకున్నాడు . అలా ఇద్దరు మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంటగా పేరు పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ మజిలీ, పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా కలిసి నటించారు. వీరు కలిసి నటిచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే 2022లో  మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు .


ఇప్పటికీ వీరి వీడాకుల పై టాలీవుడ్ లో రచ్చ జరుగుతూనే ఉంది. అయితే నాగచైతన్య తో  విడాకుల తర్వాత సమంతను మాత్రం గట్టిగానే ట్రోల్ చేశారు నెటిజెన్లు. ఆమె కావాలని విడాకులు చేసిందని .. నాగచైతను దూరం పెట్టిందని ఇలా లేనిపోని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు . అదే సమయంలో సమంత కూడా మమయో సైటీస్ వ్యాధి కి గురవటం సినిమాల కు గ్యాప్ ఇవ్వటం ఇలా తన లైఫ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి .


అయితే ఎప్పుడు గత కొంతకాలంగా సమంత వరస సినిమాలు కమిట్ అవుతుంది. రీసెంట్ గానే ఆమె బాలీవుడ్ లో చేస్తున్న సిటాటిల్ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . ఇదే క్రమంలో నాగచైతన్య కూడా ప్రస్తుతం తండెల్‌ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన గౌతమినన్‌ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుందని అంటున్నారు. గౌతమినన్ సమంతని ఒప్పించాడని కోలీవుడ్లో వార్త వైరల్ గా మారింది . అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: