టాలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించి విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. శృతిహాసన్ సింగర్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకుని వరుస సినిమాలతో శృతి బిజీగా ఉన్న సమయంలోనే మైకేల్ కోసలే అనే వ్యక్తితో డేటింగ్ చేసింది.


పెళ్లికి ముందే వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. కొన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి రిలేషన్షిప్ 2019లో స్థిరపడింది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో మైకేల్ కు శృతిహాసన్ బ్రేకప్ చెప్పింది. ముంబైకి చెందిన డుడు ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతిహాసన్ మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ చేసిన శృతి ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.


తాజాగా ఈ బ్యూటీ డేటింగ్ గురించి కొన్ని సంచలన కామెంట్ చేసింది. ఎవరితోనైనా సరే డేట్ కు వెళ్ళినప్పుడు బిల్లులు నేనే కట్టాల్సి వచ్చేదని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. నాతో వచ్చిన వారు నీ దగ్గర డబ్బు ఉందిగా కట్టేయ్ అన్నట్టుగా చూసేవారు. మొదట్లో ఎవరిని అడగకుండానే బిల్లులు అన్ని నేనే కట్టే దాన్ని. ఎందుకంటే బిల్లు పే చేయడం కూడా ఎదుటి వ్యక్తులపై ఉండే ప్రేమను చూపిస్తుంది.


అయితే ఇదే విషయం నేను అడిగితే నువ్వు ఇష్టపడే కట్టావు కదా అనే వారిని, అప్పుడు ఆ సమయంలో నాకు చాలా బాధ అనిపించిందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అప్పటినుంచి డబ్బు విషయంలో క్లియర్ గా ఉండాలని నేను అర్థం చేసుకున్నాను అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: