కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రాముఖ్య నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ కాకముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయట. అసలు ఆ విషయాలు ఏమిటి అనే వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా భద్రా సినిమా గురించి మాట్లాడుతూ ... బోయపాటి శ్రీను నాకు భద్ర సినిమా కథను వినిపించాడు. నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చేద్దాం అనుకున్నాం. ఆ తరువాత దాదాపు ఎలాంటి కథతోనే మహేష్ బాబు హీరోగా ఒక్కడు సినిమా వచ్చింది. ఇక అందులో కూడా హీరో హీరోయిన్ ను సేవ్ చేస్తూ ఉంటాడు. భద్ర మూవీ లో కూడా హీరో , హీరోయిన్ ను సేవ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఒక్కడు సినిమా వచ్చాక భద్ర సినిమాను చేయొద్దు అని కొంత మంది సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం ఆ సినిమా స్క్రీన్ ప్లే ను నమ్మాను.

ఒక్కడు , భద్ర లో కామన్ గా ఉంది కేవలం హీరో  ,హీరోయిన్ ని సెవ్ చేయడం మాత్రమే. కానీ స్క్రీన్ ప్లే అది కాదు. ఒక్కడు స్క్రీన్ ప్లే ఓరకం గాను , భద్ర సినిమా స్క్రీన్ ప్లే మరోరకంగా ఉంటుంది. దానితో ఒక్కడు సినిమా ఎఫెక్ట్ భద్ర పై ఏ మాత్రం పడదు అని నేను నమ్మాను. అందుకే ఆ సినిమా చేశాను. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: