తెలుగు సినీ పరిశ్రమలో డ్యూయల్ రోల్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఇప్పటివరకు చాలా సినిమాలలో రెండు పాత్రలలో నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బాలకృష్ణ రెండు పాత్రలలో నటించిన సినిమాలలో విజయాలు అందుకున్న సినిమాల సంఖ్య కూడా చాలా ఎక్కువ గానే ఉంది. ఇకపోతే బాలకృష్ణ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పాత్రలలో నటించాడు.

ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణ కు జోడిగా హాని రోజ్ నటించగా , కొడుకు పాత్రలో నటించిన బాలకృష్ణ కు శృతి హాసన్ జోడిగా నటించింది. ఇక ఈ సినిమా లోని రెండు పాత్రలలో అద్భుతమైన వేరియేషన్స్ బాలకృష్ణ చూపించాడు. ఇక సినిమాలో తండ్రి పాత్రలో కనిపించిన బాలకృష్ణ పాత్రను దర్శకుడు అదిరిపోయే రేంజ్ లో చూపించాడు. ఇక కొడుకు పాత్రలో కనిపించిన బాలకృష్ణ ను కూడా అదిరిపోయే రేంజ్ మాస్ యాంగిల్ లోనే చూపించి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనకు అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చాయి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. తమన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలకపాత్రను పోషించింది. ఈ మూవీలోని రెండు పాత్రల విషయంలో అద్భుతమైన వేరియేషన్స్ చూపించడంలో దర్శకుడు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో దునియా విజయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి వీరు తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: