టాలీవుడ్ స్టార్ హీరోలలో మార్కెటింగ్ పరంగా భారీ స్కిల్స్ ఉన్న హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు వ‌రుస‌లో ఉంటారు.. ముఖ్యంగా బన్నీ భార్యా స్నేహ రెడ్డి ఆయన సినిమాలకు మార్కెటింగ్ విషయాలు చూస్తున్న తర్వాత నుంచి ఆయన రేంజ్ మారిపోయింది. అలా వైకుంఠపురం మూవీ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కు వెళితే పుష్ప ఆ రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవల్ కు తీసుకువెళ్లింది. అలాగే అల్లు అర్జున్ మార్కెట్‌ను పుష్ప ముందు పుష్ప తర్వాత ఇప్పుడు పుష్ప 2 వస్తుంది.. దీన్ని కూడా మార్కెటింగ్ ప్లాన్స్ లో ఓ రేంజ్ లో రెడీ చేస్తున్నట్టు ఇప్పటికే ప‌లు వార్తలు వైరల్ గా మారాయి. అలాగే బన్నీ భార్య స్నేహారెడ్డి ఆలోచనలు పుష్ప2 విషయంలో చాలా పెద్దగానే ఉంటాయి.


అయితే ఇదే టైంలో మెగా అభిమానులు ట్రోలింగ్ కూడా బన్నీని కంగారు పెడుతుంది.. పుష్ప 1న్ సమయంలో కూడా ఇలాగే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియానే సినిమా రిజల్ట్స్ ను డిసైడ్ చేసింది.. బన్నీకి ఇప్పుడు ఇదే భయం పట్టుకుంది. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేనకు కాకుండా వైసిపి అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో బన్నీని మెగా - పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా టార్గెట్ చేశారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ‌గా నిలబడ్డారు ఇటు టిడిపి క్యాడ‌ర్‌ కూడా బన్నీ గట్టిగానే టార్గెట్ చేశారు.


ఇక దీంతో ఇప్పుడు పుష్ప2 విషయంలో మెగా అభిమానులు ఏ ప్లాన్తో దిగుతారని ఆందోళన అల్లు అర్జున్ లో ఉంది. అందుకే ఆహాలో ప్రసారం అయ్యే అన్ స్టాపబుల్ సీజన్ 4 లో పుష్ప2 టిం మొత్తం పాల్గొంటున్నారట. అందులో వివాదాలకు ముగింపు పలికేలా చూడాలని భార్య స్నేహారెడ్డి బన్నీకి ఓ సలహా ఇచ్చారట. ఈ వివాదాన్ని ఇప్పటికే పెద్దది చేశారని ఎండ్ కార్డ్ పడకపోతే మాత్రం ఫ్రీ బుకింగ్ మార్కెట్ పై ప్రభావం ఉంటుందని, కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి అందరికీ క్లారిటీ ఇవ్వాలని సలహా ఇచ్చారట. దీనికి బన్నీ కూడా ఓకే అనడంతో బాలయ్య అడిగే ప్రశ్న ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో పెరిగింది. ముందు సీజన్ 4 లో ఫస్ట్ ఎపిసోడ్ బన్నీతో ప్లాన్ చేసారట. అసలు షూట్ కూడా ఫినిష్ చేసినట్టు టాక్ కూడా ఉంది. దీపావళి రోజున రిలీజ్ చేయాలని చూసినా వద్దని ఆగారట. సినిమా విడుదలకు వారం రోజుల ముందు రిలీజ్ చేస్తారట. ఇప్పటికే బన్నీ విషయంలో మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అటు జనసేన క్యాడర్ కూడా సీరియస్ గానే ఉంది. మరి బన్నీ ఎలా ఎండ్ చేస్తాడో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: