. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

సౌత్ చిత్ర ప‌రిశ్ర‌లో గత కొంతకాలంగా విడాకుల ట్రెండ్ గట్టిగా నడుస్తుంది . ముఖ్యంగా సెలబ్రిటీలు విడాకులు తీసుకున్ని విడిపోతున్నారని వార్తలు తరుచుగా వస్తున్నాయి . పెళ్లయిన కొన్ని రోజుల కే మనస్పర్థ‌లతో విడిపోయే జంటలు కొన్ను ఉంటే .. మరి కొంత మంది చాలా కాలం కలిసి పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి . ఇలా విడిపోతున్న వారిలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్‌లు కూడా ఉన్నారు .


ఇక విరిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఇక ఈ జంట‌ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు . అయితే ఈ జంట 2022 లో విడిపోతున్నట్టు అధికారికం గా ప్రకటించి అభిమానుల కు షాక్ ఇచ్చారు . ఇక అప్పటి నుంచి ఐశ్వర్య - ధనుష్ విడివిడిగా ఉంటున్నారు .. కానీ పిల్లల బాధ్యత ఇద్దరూ దగ్గరుండి చూసుకుంటున్నారు . అయితే ధనుష్ విడాకుల గురించి తెలిసిన అభిమానులు ఇద్ద‌రు కలిసి ఉంటే బాగుండు అని అభిప్రాయ పడుతున్నారు .. ఈ క్రమంలోనే వీరి విడాకులు ప్రక్రియలో ఊహించిన ట్విస్టులు వస్తున్నాయి .


ఐశ్వర్య - ధనుష్ కలిసి ఎవరు ఊహించిన నిర్ణయం తీసుకున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ముఖ్యంగా సూపర్ స్టార్ రజిని ఆరోగ్యం కుటుంబ కారణాల వల్ల ఐశ్వర్య కాస్తా వెనక్కి తగ్గి ధనుష్ తో కలిసి ఉండటాని కి ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది . అదే విధంగా ధనుష్ కూడా తన తో కలిసి ఉండడాని కి ఓకే చెప్పడాని కూడా అంటున్నారు . అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియ‌న‌ప్ప‌టికీ వారిద్దరు కలిసి ఉండాలని అభిమానులు గట్టి గా కోరుకుంటున్నారు . ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హ‌ట్ టాపిక్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: