సౌత్ ఇండియాలోని పాపులర్ హీరోలలో కిచ్చా సుదీప్ ఒకరు కాగా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం రోజున కన్నుమూశారు. తల్లి మరణం గురించి సుదీప్ ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇన్నిరోజులూ మనిషి రూపంలో నా పక్కన తిరిగిన దేవత అమ్మ అని సుదీప్ అన్నారు. అమ్మ నా మొదటి గురువు అని సుదీప్ పేర్కొన్నారు. అమ్మ నా మొదటి అభిమాని అని నేను ఎలా నటించినా ఇష్టపడేదని సుదీప్ చెప్పుకొచ్చారు.
 
అమ్మ ఇప్పుడు అందమైన జ్ఞాపకం మాత్రమేనని సుదీప్ తెలిపారు. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయిందని నేను ప్రస్తుతం అనుభవిస్తున్న బాధను వ్యక్తపరచాలని భావించినా నాకు మాటలు రావడం లేదని సుదీప్ వెల్లడించారు. అమ్మ లేదనే విషయాన్ని అంగీకరించలేకపోతున్నానని సుదీప్ పేర్కొన్నారు. ఇకపై అమ్మ నుంచి గుడ్ మార్నింగ్ కన్నా అనే మెసేజ్ నాకు రాదని సుదీప్ కామెంట్లు చేశారు.
 
శుక్రవారం రోజున అమ్మ చివరిసారి మెసేజ్ పెట్టిందని శనివారం రోజున బిగ్ బాస్ షో షూట్ లో ఉన్న సమయంలో అమ్మ ఆస్పత్రిలో చేరినట్టు ఫోన్ వచ్చిందని సుదీప్ పేర్కొన్నారు. నేను వైద్యులతో మాట్లాడి షో వేదికపైకి వెళ్లానని సుదీప్ తెలిపారు. మనసులో ఎంతో బాధ ఉన్నా షో పూర్తి చేశానని సుదీప్ కామెంట్లు చేశారు. షూటింగ్ పూర్తై ఆస్పత్రికి వెళ్లే సమయానికి అమ్మను వెంటిలేటర్ పై ఉంచారని సుదీప్ పేర్కొన్నారు.
 
అమ్మ స్పృహలో ఉన్న సమయంలో ఆమెను చూడలేకపోయానని సుదీప్ చెప్పుకొచ్చారు. నిన్న అమ్మ శాశ్వతంగా దూరమైందని కొన్ని గంటల్లోనే అంతా మారిపోయిందని సుదీప్ చెప్పుకొచ్చారు. నేను షూట్ కు వెళ్తున్న సమయంలో నన్ను హత్తుకుని అమ్మ జాగ్రత్తలు చెప్పేదని ఆయన తెలిపారు. కొన్ని గంటల్లోనే అమ్మ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిందని సుదీప్ కామెంట్లు చేశారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: