సూపర్ స్టార్ మహేష్ బాబుకి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయనప్పటికీ మహేష్ కు ప్రపంచ వ్యాప్తంగా మహేష్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ మహేష్ అంటే పడి చచ్చిపోతారు.. మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు ఆరోజు అభిమానులకు పండగే.. ఆయన సినిమాల రిలీజ్ రోజు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం మాములుగా ఉండదు... ఈ ఏడాది మహేష్ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది..ప్రస్తుతం సూపర్ స్టార్  మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. అయితే మహేష్ బాబు గతంలో నటించిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి..మహేష్ నటించిన సినిమాల్లో ఖలేజా సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు కానీ ఖలేజా సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. ఈ సినిమాలో త్రివిక్రమ్ అద్భుతమైన డైలాగ్స్ ఇప్పటికీ ఎంతో ఫేమస్.. మహేష్ యాక్టింగ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు..

సినిమాలో మహేష్ బాబు యాటిట్యూడ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం కూడా ఎంతగానో అలరిస్తుంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో అనుష్క అద్భుతంగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో చాలా భాగం రాజస్థాన్ లో జరుగుతుంది. టాక్సీ డ్రైవర్ అయినా హీరో.. తన కారుపై పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి రాజస్థాన్ వెళ్తాడు. అయితే ఈ సీన్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొంతమంది ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన నటి గురించి తెగ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన వీడియోలు, మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.. అసలు ఆమె ఎవరో చెప్పండ్రా బాబు అంటూ చేసిన ఫన్నీ వీడియోలు బాగా వైరల్ గా మారాయి. ఆమె కోసం కుర్రాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా గాలించారు. తాజాగా ఆ బ్యూటీ ఎవరో తెలిసిపోయింది..ఆమె పేరు దివ్య మేరీ సిరియాక్. ఆమె గతంలో కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరం అయింది..సోషల్ మీడియాలో ఈ భామ ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.. ఆమె పేరు తెలియగానే నెటిజన్స్ ఆమె వివరాలు వెతకడం మొదలు పెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: