మరికొద్ది రోజులలో అక్కినేని ఇంటికి కోడలు కాపాడుతున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల , అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ గడిచిన కొన్ని నెలల క్రితం జరిగింది. అయితే ఇంకా వివాహ తేదీని ప్రకటించకుండానే తాజాగా శోభిత పెళ్లి పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. శోభిత పెళ్లికి సంబంధించిన పనులలో పసుపు దంచడం, గోధుమ రాయి పూజ చేయడం వంటివి వైజాగ్ లో తన సొంత ఇంట్లో చాలా గ్రాండ్గా ఈ పనులను చేస్తోంది.. గ్రీన్ అంచు చీరలో పసుపు దంచుతూ శోభిత తన ఫోటోలను షేర్ చేసింది.



శోభిత షేర్ చేసిన ఫోటోలలో కేవలం పసుపు దంచడం గోధుమ రాయిని పూజించడం వంటి పనులను మాత్రమే చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ఫోటోలు చూసినా అభిమానుల సైతం పసుపు కొట్టారు అంటే కచ్చితంగా వివాహ పనులు మొదలైనట్టే అంటూ తెలియజేస్తున్నారు. దీంతో త్వరలోనే చైతన్య, శోభిత  పెళ్లి జరగబోతోంది అనే విధంగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే వీరి వివాహ తేదీని తెలియజేస్తారనే విధంగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం చెప్పలేదు.



అలా చెప్పకుండానే పెళ్లి పనులు మొదలుపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది.ఆ తర్వాత 2016లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇమే బాలీవుడ్, హాలీవుడ్ ,టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది.. గడిచిన రెండు రోజుల క్రితం శోభిత,  నాగచైతన్య ఇద్దరు కూడా ఒక షాపింగ్ మాల్ లో ఫోటో దిగుతూ ఒక ఫోటోని షేర్ చేశారు. కానీ అంతలోని ఇలా పెళ్లి పనులలో బిజీగా అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. నాగచైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్లో ప్రస్తుతం తండెల్  చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇక శోభిత కూడా ప్రస్తుతం తన చేతిలో ఏ ఒక్క సినిమాను కూడా పెట్టుకోలేదట. వివాహమైన తర్వాత శోభిత సినిమాలకు దూరం అవుతుందా నటిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: