రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సంవత్సరం కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్గా నటించగా ... నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించగా ... రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వి ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ "రాజా సాబ్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఆడియో హక్కులను టీ సిరీస్ సౌత్ సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను టీ సిరీస్ సౌత్ సంస్థ వారు ఏకంగా 25 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి రాజా సాబ్ మూవీ.తో ప్రభాస్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: