కన్నడ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో రిషబ్ శెట్టి ఒకరు. ఈయన సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఆఖరుగా కాంతారా అనే సినిమాలో హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి రిషబ్ శెట్టి దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాతో ఒక్క సారిగా రిషబ్ శెట్టి కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ప్రస్తుతం రిషబ్ శెట్టి "కాంతారా 2" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కాంతారా మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. దానితో ఈయన నేరుగా తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఓ రెండు క్రేజీ బ్యానర్లు ఇప్పటికే ఈయనతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు , ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రిషబ్ శెట్టి మొదటగా ఒక తెలుగు సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మైత్రి సంస్థ లో జై హనుమాన్ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఇలా రెండు తెలుగు సినిమాలలో నటించడానికి రిషబ్ శెట్టి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఈ రెండు బ్యానర్లలో రిషబ్ శెట్టి నటించబోయే మూవీ లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరికొన్ని రోజుల్లో విడుదల కానున్నట్లు కూడా వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: