తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఫుల్ జోష్ లో సినిమాలో నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఒకటి. ఈ సంస్థ వారు ఇప్పటికే ఈ సంవత్సరం కూడా అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం మొదటగా ఈ బ్యానర్ వారు ఈగల్ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆ తరువాత మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక కొంత కాలం స్వాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ... తాజాగా విశ్వం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యానర్ వారు ఒక సినిమాతో కూడా మంచి స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఈ బ్యానర్ చేతిలో ప్రస్తుతం కూడా అనేక సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్యానర్ వారు అడవి శేషు హీరోగా రూపొందుతున్న "గూడచారి 2" సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని ఈ బ్యానర్ వారు భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. అలాగే సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జాట్ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను ఈ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ హీరోక్గా రూపొందుతున్న రాజా సాబ్ సినిమాను కూడా ఈ బ్యానర్ వారే నిర్మిస్తున్నారు.

ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా సినిమాను ఈ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న మీరాయ్ అన్ని సినిమాలు కూడా ఈ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇలా ప్రస్తుతం కూడా ఈ బ్యానర్ చేతిలో ఐదు క్రేజీ సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలలో కనీసం మూడు సినిమాలు మంచి విజయం సాధించిన ఈ బ్యానర్ కు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ఐదు సినిమాల్లో ఏ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pmf