తెలుగు సినీ ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీసినిమా అనంతరం సినిమా అవకాశాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. అతితక్కువ సమయంలోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో సక్సెస్ అందుకుంది. ఆ సినిమా అనంతరం తన కెరీర్ పూర్తిగా మారిపోయింది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, కస్టడీ వంటి అనేక సినిమాలలో నటించి వరుస ఫ్లాప్ లను మూటగట్టుకుంది.


ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో తెలుగు సినిమాలు ఏమి లేకపోవడం బాధాకరం. మొన్న ఆ మధ్యకాలంలో శర్వానంద్ తో కలిసి మనమే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. అయితే తెలుగులో ఎలాంటి ఆఫర్స్ రాకపోయినా తమిళంలో కృతి శెట్టి జోరు బాగానే ఉంది. పైగా మలయాళంలో నటించిన మొదటి సినిమా అజయంతే రాండం మోషణం సినిమా బాగానే ఆడింది. తమిళంలోనూ కార్తీ, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ వంటి హీరోలతో ఈ బ్యూటీ నటిస్తోంది. తెలుగులోనూ కృతి శెట్టికి ఈ మధ్యనే ఓ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.


విశ్వక్సేన్ హీరోగా, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ వచ్చినట్టే. మరోవైపు సోషల్ మీడియాలో కృతి శెట్టి జోరుగా అందాల ఆరబోత చేస్తోంది. అదే కృతి శక్తికి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తన అందాల ఆరబోతకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.


ఇదిలా ఉండగా....కృతి శెట్టికి ఓ స్టార్ హీరో అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడట. చాలా రోజుల నుంచి ఇలానే వరుసగా కృతి శెట్టికి ఫోన్ చేయడం, తనను విసిగించడం చేస్తున్నారట. ఈ విషయాన్ని కృతి శెట్టి తన స్నేహితులతో చెప్పుకొని బాధపడిందట. ఈ విషయాన్ని స్వయంగా కృతి శెట్టి సన్నిహితులు తెలియజేశారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: