టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనసూయ గురించి తెలియని వారు ఉండరు. మన తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం పాపులర్ అవుతుంది అనసూయ భరద్వాజ్. మొదట్లో యాంకర్ గా రాణించిన ఈ బ్యూటీ ఆ తర్వాత... సినిమాల్లో కూడా దూసుకు వెళ్తోంది. దాదాపు జబర్దస్త్ లో 10 ఏళ్ల పాటు... యాంకర్ గా పనిచేసింది. అక్కడే అనసూయ భరద్వాజ్ కెరీర్ మొత్తం మారిపోయింది అని చెప్పవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో.. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయింది అనసూయ. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలలో అవకాశాలు రావడంతో.... జబర్దస్త్ షోకు గుడ్ బాయ్ చెప్పి సినిమాలలోనే సెటిల్ అవుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ చాలా సినిమాలు చేసింది. నయనతార లాగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప రెండు భాగాల్లో అనసూయ భరద్వాజ కీలకపాత్ర... పోషించింది.

 ఇది ఇలా ఉండగా... యాంకర్ అనసూయ గురించి దర్శకుడు సాయి రాజేష్.... సంచలన వ్యాఖ్యలు చేశాడు.  అనసూయ ను తన భార్యగా కొంతమంది ఊహించుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని... టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు. యాంకర్ అనసూయ కేసీఆర్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్లో బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 గతంలో... అనసూయతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో తాను పోస్ట్ పెట్టానని వివరించాడు. దాంతో ఆమె భర్తను...  నేనే అనుకోని కొంతమంది బండ బూతులు తిట్టారని దర్శకుడు సాయి రాజేష్ వెల్లడించాడు. యాంకర్ అనసూయ అంతా బాగుంటే... ఆమె భర్త చాలా నల్లగా ఉన్నాడని కూడా ట్రోలింగ్ చేసినట్లు... ఫన్నీ కామెంట్స్ చేశాడు సాయి రాజేష్.  దీంతో సాయి రాజేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజెన్స్... తన భర్తను కూడా అనసూయ మార్చేసిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: