ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది . టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే . అయితే కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న నాగచైతన్య బడా హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆగస్టు 8వ తేదీ నిశ్చితార్థం చేసుకున్నాడు . ఆయన నిశ్చితార్ధం చేసుకొని ఆ పిక్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోయారు.


గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ ప్రచారం జరిగింది . కానీ ఎక్కడ ఆ విషయాన్ని వీళ్లు అఫీషియల్ గా బయట పెట్టలేదు . ఫర్ ద ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ ఫిక్స్ శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్య షేర్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోయారు . కొంతమంది ఫ్యాన్సీ సపోర్ట్ చేస్తే మరి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం బూతులు తిట్టారు . అయితే ఇప్పుడు పెళ్లి విషయంలోనూ అదే విధంగా చేశాడు అక్కినేని నాగార్జున .



నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4వ తేదీ గ్రాండ్గా జరగబోతున్నట్లు సమాచారం అందుతుంది . అయితే ఇప్పటివరకు పెళ్లికి సంబంధించిన ఏ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు నాగార్జున - నాగచైతన్య . కానీ రీసెంట్ గా శోభిత ధూళ్ళిపాళ్ల మాత్రం తన పసుపు దంచడానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. విశాఖపట్నంలో జరిగిన పసుపు దంచే వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం సంచలనంగా మారింది . ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంతో సాంప్రదాయ బద్ధంగా ఈ ఫంక్షన్ నిర్వహించడం గమనార్హం. అయితే ఎందుకు నాగచైతన్య శోభిత పెళ్లి డేట్ అనౌన్స్ చేయడం లేదు. ఎందుకు వాళ్ళ పెళ్లి వేదిక ..మిగతా వివరాలను చెప్పడం లేదు..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా  మారింది. అయితే గతంలో చేసిన హంగామా ఆడంబరం కారణంగానే నాగచైతన్యకు దిష్టి తగిలి ఆ కారణంగా విడాకులు తీసుకున్నాడు అని .. మొదటి పెళ్లిలో జరిగిన తప్పు రెండవ పెళ్లిలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట నాగార్జున . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: