కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ.. అయితే సూర్య నటించిన గత చిత్రాలు ఆకాశమే హద్దుర,జై భీమ్ వంటివి డైరెక్టర్ గా ఓటీటిలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇవి థియేటర్లో విడుదల అయ్యి ఉంటే భారీ హీట్ అయ్యేవని కూడా అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన సూర్యకు భారీ క్రేజ్ పెరిగిపోయింది. రోలెక్స్ పాత్ర యూత్ లోనే పాపులారిటీ సంపాదించిందని చెప్పవచ్చు.

ఇప్పుడు డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ ఉన్నారు. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం ఫ్రీ రికార్డింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా కొద్దిరోజుల సమయం ఉండగానే కంగువ సినిమాకు సంబంధించి రివ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. కంగువ చిత్రంలో మొదటి భాగానికి అసలు తిరిగేలేదని ఈమధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాలలో ఇలాంటి సినిమా విడుదల కాలేదని కూడా తెలియజేస్తున్నారు. సూర్యకు ఈ సినిమా కం బ్యాక్ ఇస్తుందని కూడా తెలియజేస్తున్నారు.

కంగువ చిత్రం టైం మిషన్ కాన్సెప్ట్ తో తీసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్లో కేవలం ఒక్క వర్షన్ మాత్రమే చూపించడం జరిగిందట .మరో వర్షన్ ను సర్ప్రైజ్ గా అభిమానులకు చూపించలేదని సమాచారం. అలాగే ఇంటర్వెల్ మధ్యలో వచ్చే ట్విస్ట్ హైలెట్ గా ఉంటుందని ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటివరకు ఏ చిత్రం కూడా రాలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి సూర్య కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కంగువ చిత్రం ఏ మేరకు అభిమానులను మెప్పిస్తుందో చూడాలి అంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: