ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది... ఏ ఇండస్ట్రీ చూసుకున్నా పాన్ ఇండియా సినిమా అంటూ ఏది పడితే అది తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా వస్తున్న వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తూ చిరస్థాయిగా మిగిలిపోతున్నాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయికి తీసుకువలిన దర్శకుడు రాజమౌళి అంటారు. అయితే ఆయనకంటే ముందే మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి తీసుకు వెళ్లిన‌ దర్శకులు ఎందరో ఉన్నారు. అలాంటి దర్శకులలో సీనియర్ దర్శకుడు కె.వి.రెడ్డి కూడా ఒకరు.


ఇప్పటికీ ఈనను దర్శకులు గురువుగా భావిస్తారు. మన పాత రోజుల్లోనే ఎన్నో విభిన్నమైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచారు. 70- 80ల‌ కాలంలోనే తన వినూత్న ఆలోచనతో ఇప్పుడు వచ్చే సినిమాలను అప్పట్లోనే తీశారు.  అలా కె.వి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన గొప్ప సినిమాలలో మాయాబజార్ కూడా ఒకటి .. ఇప్పటికీ ఈ సినిమా కల‌క్ట్  క్లాసిక్ గా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ , నాగేశ్వరరావు , ఎస్వీ రంగారావు , సావిత్రి వంటి అగ్ర నటులతో ఆయన తీసిన ఈ గొప్ప కళాకాండం తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలి పాన్‌ ఇండియా సినిమా అని అంటారు.


మహాభారతంలోని అభిమన్యుడు - శశిరేఖ వివాహ ఘట్టాన్ని మూల కథగా తీసుకుని మాయాబజార్ సినిమాని తెరకెక్కించారు . ఆ రోజుల్లో సాధారణంగా 30వేల‌ బడ్జెట్ ను మించి సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ మాయాబజార్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయ ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనకాడ లేదు. తెలుగు , తమిళ భాషలో ఒకేసారి తెర్కెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఈ సినిమాని రెండు లక్షల పైగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలాగే ఈ సినిమా విడుదల తర్వాతే ఎన్నో భాషల్లో డబ్బ్‌ చేయగా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. అందుకే నాటికి నేటికైనా మరి ఎప్పటికైనా మాయాబజార్ అనేది మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ గోల్డెన్ మెమరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: