మనసారా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదివ్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కోలీవుడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె మారుతీ దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాతో మరింతగా ఆకట్టుకుంది. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈమెకు.. వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ముఖ్యంగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈమె పేరు ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే యువరాజు, హనుమాన్ జంక్షన్, వీడే తదితర చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రీదివ్య ఆ తర్వాత హీరోయిన్ గా మారి మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, కేరింత వంటి చిత్రాలలో నటించింది.

ఇక తమిళంలో కూడా ఎక్కువగా సినిమాలు చేసిన ఈమె కార్తీతో కాష్మోరా , శివ కార్తికేయన్ తో రెమో,  విశాల్ తో రాయుడు వంటి చిత్రాలలో నటించింది. ఇదిలా ఉండగా శ్రీదివ్య వాళ్ళ అక్క కూడా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అని చాలామందికి తెలియదు అని చెప్పవచ్చు. ఈమె పేరు శ్రీ రమ్య. శ్రీకాంత్ తో విరోధి అలియాస్ జానకి వంటి సినిమాలు చేసిన ఈమె,  అవి పెద్దగా హిట్టు కాకపోవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఇక చివరిగా 2013లో తమిళంలో యమున అనే సినిమాలో  కనిపించింది.


ఇక తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ఈమె చెల్లెలు శ్రీదివ్య మాత్రం ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇటు తెలుగు అటు తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఏది ఏమైనా శ్రీదివ్య అక్క శ్రీ రమ్య కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసిందని తెలిసి అభిమానులు ఆ సినిమాలను తెగ వెతికేస్తున్నారు. ఏది ఏమైనా అక్క చెల్లెలు ఇద్దరు ఇండస్ట్రీలోకి వచ్చినా.. అక్క మాత్రం అతి తక్కువ సమయంలోనే ఫేడ్ అవుట్ అవ్వడంతో అభిమానులు రకరకాల కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: