ఈ రోజు టాలీవుడ్‌ ని ఏలుతున్న డజను మంది హీరోల్లో దాదాపు అరడజను మంది మెగా కుటుంబంలోని వారే కావడం విశేషం. వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకరు. ఇక ఈ మెగా బాబాయ్, అబ్బాయిల బంధం గురించి అందరికీ తెలిసినదే. చరణ్ మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో గ్లోబుల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఇక ఎప్పుడూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూ, అభిమానులతో అప్పుడప్పుడూ టచ్ లో ఉంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ దేశాలు దాటిస్తున్న చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే, కెరీర్ ప్రారంభ దశలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని మెగాభిమానులు వైరల్ చేస్తున్నారు. ఆ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...   అప్పట్లో చరణ్ దగ్గర డబ్బులు తీసుకునేవాడ్ని. కానీ చిన్నపిల్లాడి దగ్గర తీసుకున్నాను అని సిగ్గుపడేవాడ్ని కాదు. నా సినిమా స్టార్ట్ అయ్యినప్పుడు నాకు అరవింద్ గారు నెలకు ఐదు వేలు ఇచ్చేవారు. సినిమా అయిపోయిన తరువాత నా దగ్గర డబ్బులు లేక ఖాళీగా ఉండేవాడ్ని. వదిన దగ్గరకు వెళ్లి డబ్బులు అడగాలంటే, హీరో అయ్యిపోవావు. ఇంకా డబ్బులేంటి? అంటారు అనే భయం నాకు ఉండేది. ఒక్కోసారి పది రూపాయలు కూడా ఉండేవి కాదు. అప్పుడు చరణ్ కు పాకెట్ మనీ రెండు వందలు ఇచ్చేవారు. వాడికి ఖర్చు పెట్టుకోవటం తెలిసేది కాదు. దాంతో వడ్డీతో పాటు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి  తీసుకొనే వాడిని. అంటూ పవన్ సరదాగా చెప్పుకొచ్చారు.

ఈ సరదా మాటలను ఇపుడు జనాలు సోషల్ మీడియాలో తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇపుడు వందలకోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకొనే పవన్ కళ్యాణ్ అప్పుడు 10 రూపాయిల కోసం రామ్ చరణ్ దగ్గర అప్పులు చేశాడా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్న విషయం అందరికీతెలిసిందే. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మించగా, ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: