టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. వీరిద్దరూ కూడా అద్భుతమైన స్థాయిలో ప్రస్తుతం కెరియర్ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం ఈ ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో ఓ సినిమా మిస్ అయిందట అనే విషయం మీకు తెలుసా ..? ఓ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీరి కాంబోలో ఓ సినిమా చేయాలి అని అంతా సెట్ చేశాడట. కానీ చివరి నిమిషంలో ఈ మూవీ క్యాన్సిల్ అయ్యిందట. అసలు ఆ వివరాలు ఏమిటి .? ఎందుకు ఆ సినిమా క్యాన్సల్ అయింది అనే విషయాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రజినీ కాంత్ హీరో గా కథానాయకుడు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కె ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రజనీ కాంత్ కి స్నేహితుడి పాత్రలో జగపతి బాబు నటించాడు. ఇక రజనీ కాంత్ కు స్నేహితుడి పాత్రలో మొదటగా ఈ మూవీ దర్శకుడు బాలకృష్ణ ను అనుకున్నాడట. అందుకు సంబంధించిన కథను కూడా బాలయ్య ఒక వివరించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ తర్వాత రజనీ కాంత్ , బాలకృష్ణ కు ఫోన్ చేసి మీరు నా సినిమాలో నా స్నేహితుడి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారట. అది అద్భుతమైన విషయం. కాకపోతే ఆ సినిమాలో మీరు చేయడానికి ఒప్పుకున్న పాత్ర చాలా చిన్న పాత్ర. అది మీ స్థాయికి మీ ఈమేజ్ కి పెద్దగా సెట్ కాదు. అలాంటి పాత్ర మీరు చేయడం వల్ల ఆ సినిమాకే నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ క్రేజ్ వల్ల ఆ సినిమాకు ఎఫెక్ట్ అవుతుంది అని అన్నాడట. దానితో బాలయ్య కూడా ఆలోచించి ఆ సినిమా చేయను అని అన్నాడట. అలా బాలయ్య , రజనీ కాంత్ కాంబోలో సినిమా మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: