నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్.. ఈ షో సీజన్-4 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి ఎపిసోడ్ ని సీఎం చంద్రబాబు నాయుడుని అతిధిగా తీసుకోవచ్చారు. అక్టోబర్ 25 రాత్రి 8:30 నిమిషాలకు ఈ ఎపిసోడ్ స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే మొదటిసారి ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమోని సైతం రిలీజ్ చేశారు ఆహా టీం.



ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారుతున్నది.. దేశ రాజకీయాలలోని ఎవరు చూడని విజయాన్ని అందుకున్న మా బావగారు మీ బాబు గారు అంటూ బాలయ్య సీఎం చంద్రబాబు ఇంట్రడక్షన్ తో స్టేజిని దద్దరిల్లేరా చేశారు. అలాగే స్టేజ్ మీద ఎన్టీఆర్ బొమ్మకు నివాళులు అర్పించడం కూడా జరిగింది. అలాగే బాలయ్య చంద్రబాబు మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు అక్కడ ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదట తనని అరెస్టు చేసిన విధానం పైన చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా మ్యూట్ చేశారు.. ఇక అలాగే మొదటి రాత్రి జైల్లో జీవితాన్ని ఎలా గడిపారు అనే విషయాన్ని బాలయ్య అడగగా చంద్రబాబు తనదైన స్టైల్ లో సమాధానాన్ని తెలిపారు.



తను మొదటి రోజు నుంచి 53 రోజుల వరకు తన చావు గురించి భయపడలేదు అంటూ తెలిపారు సీఎం చంద్రబాబు.. నేనైతే తప్పు చేసిన వాడిని అసలు వదిలిపెట్టను అంటూ తెలిపారు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కళ్యాణ్ బాబు గారు అంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మార్చేసిన ముఖచిత్రం ఆ మీటింగు అంటూ తెలిపారు. ఆ జైలు గోడల మధ్య.. అక్కడ ఏం మాట్లాడుకున్నారు అనే విషయం ప్రజలకు తెలియాలి అంటూ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తాను ఏం మాట్లాడాలని విషయం పైన చెబుతూ ఉండగా మ్యూట్ చేశారు. అలాగే కక్ష్య రాజకీయాల విషయం పైన కూడా మాట్లాడుతూ పలు విషయాలని పంచుకోవడం జరిగింది చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: