అక్కినేని నాగచైతన్య, నటి శోభిత కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక వీరి పెళ్లి పనులు సోమవారం రోజున మొదలుపెట్టారు. నటి శోభిత ఇంట్లో పెళ్లి సందడి షురూ అయింది. ఈ మేరకు ఆ ఫోటోలను శోభిత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. "గోధుమ రాయి పసుపు దంచడం మొదలైపోయింది" అంటూ పోస్ట్ పెట్టి క్యాప్షన్ రాసుకొచ్చింది.


స్వయంగా శోభిత పసుపు దంచుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలో శోభిత చాలా సాంప్రదాయంగా ముస్తాబయింది. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టుచీరలో శోభిత మెరిసిపోయింది. ఈ ఫోటోలు చూసిన శోభిత అభిమానులు పెళ్లి ఎప్పుడు చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే నిశ్చితార్థ సమయంలో దూరంగా ఉన్న శోభిత చెల్లెలు సమంత ధూళిపాళ్ల సైతం ఈ వేడుకకు హాజరైంది.


శోభిత చెల్లెలు పేరు కూడా సమంత ధూళిపాళ్లనే. సమంత ధూళిపాళ్ల విషయానికి వస్తే.... ఈమె డాక్టర్. బార్సిలోనా యూనివర్సిటీలో తన డాక్టర్ చదువు పూర్తి చేసి రేడియో రోగ నిర్ధారణ విభాగంలో ఎండిగా తన సేవలు అందిస్తోంది. అయితే సమంత తన అక్క కంటే ముందుగానే వివాహం చేసుకొని విదేశాల్లో ఉండిపోయింది.


ఇక శోభిత ధూళిపాళ్ల వివాహం కోసం వచ్చింది. తన అక్క పెళ్లి పనుల్లో సమంత చాలా చురుగ్గా పాల్గొంటుంది. కాగా, నాగచైతన్య తనకు కాబోయే భార్య నటి శోభితతో కలిసి దిగిన ఓ ఫోటోను రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి ఓ లిఫ్ట్ లో దిగిన ఫోటోలను నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: