దేవర సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ .. పాన్ ఇండియా లెవెల్ లో బాలీవుడ్ సినిమాలకు మించి దేవర సెన్సేషనల్ హిట్ అవడంతో జాన్వీ కూడా ఎంతో హ్యాపీగా ఉంది.. ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా తక్కువే అయినా ఆమెకు మాత్రం ఈ సినిమా చాలా ఆనందాన్ని ఇచ్చిందనే మాట నిజం. దేవర తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలకు రెడీ అవుతుంది. ఇప్ప‌టికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్గా కన్ఫామ్ అయ్యింది జాన్వీ కపూర్.


అలాగే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాలో కూడా జాన్వీ హీరోయిన్‌ గా నటిస్తుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అది ఎంతవరకు నిజమో రాజమౌళియే చెప్పాలి. అలాగే అటు కోలీవుడ్ లో కూడా దేవర ప్రమోషన్ లో జాన్వీ కపూర్ అక్కడ వారికి దగ్గరయింది. ఆమె తమిళంలో మాట్లాడటం చూసి అక్కడ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.. తల్లి శ్రీదేవిని స్టార్ ను చేసింది తమిళ చిత్ర పరిశ్రమ ఆ విశ్వసం జాన్వీ చూపించడం తమిళంలో మాట్లాడటం చూసి అక్కడ డైరెక్టర్లు కూడా ఎంతో హ్యాపీ అయ్యారు. అందుకే ఇప్పుడు ఆమెకి సినిమా ఆఫర్లు ఇవ్వాలని రెడీ అవుతున్నారు.


అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కూడా టాలీవుడ్ లో పగ వేయడానికి రెడీ అవుతుంది. దెవ‌ర‌తో  పాన్ ఇండియా లెవెల్ లో అక్క హడావుడి చేస్తే.. దేవర తోనే తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని ఖుషి కపూర్ ప్లాన్ చేస్తుంది. తండ్రి బోనీ కపూర్ సలహాతో అక్క ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో హైదరాబాదులో ఈ చిన్నది ల్యాండ్ అవ్వనుంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో ఖుషి కపూర్ సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఫైనల్ అయింది.


సెకండ్ హీరోయిన్ గా ఖుషీని ఫైనల్ చేయాలని నీల్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఖుషీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్క కంటే చెల్లెలు బాగుంది అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఆమె ఒక్కసారి సక్సెస్ అయింది అంటే మాత్రం సౌత్ లో పాగా వేయడం పెద్ద మేటర్ కాదు. సౌత్ లో హీరోయిన్ల కొరత గట్టిగానే కనపడుతోంది. ఎటు తిరిగి ఎటు చూసినా రష్మిక, మృణాల్ ఠాకూర్ మినహా ఎవరూ కనపడటం లేదు. అందుకే ఇప్పుడు ఖుషీ ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలని చూస్తున్నట్టు టాక్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: