అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల  పెళ్లి పనులు తాజాగా స్టార్ట్ అయ్యాయి. గోధుమరాయి,పసుపు దంచడం వంటి పనులతో శోభిత ధూళిపాళ్ల తన పెళ్లి పనులను స్టార్ట్ చేసింది.దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ చైతూ శోభిత పెళ్లి పనులు మొదలయ్యాయని, కానీ పెళ్లి డేట్ ఎప్పుడో చెప్పకుండానే సీక్రెట్ గా పెళ్లి పనులు మొదలు పెట్టారని నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.అయితే పెళ్లికి మరి కొద్ది రోజులు ఉన్నాయి అనగా అక్కినేని ఇంటికి కోడలుగా రాబోతున్న  శోభిత ధూళిపాళ్ల మీద ఒక రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే.. పెళ్లయ్యాక అక్కినేని ఫ్యామిలీకి శోభిత పెద్ద షాక్ ఇవ్వబోతుందట. ఎందుకంటే ఎప్పుడైతే నాగచైతన్యని పెళ్లి చేసుకుంటుందో ఆ తర్వాత వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. 

అయితే సెలబ్రిటీలు వేరు కాపురం అనే విషయం మామూలే. ఎందుకంటే సినిమా కోసమో లేదా ప్రైవసీ కోసమో ఈ జంటలు పెళ్లయ్యాక వేరే ఇంట్లోకి మారిపోతూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నాక వేరు కాపురం పెట్టిన వాళ్ళు ఉన్నారు.కానీ కొంతమంది మాత్రం ఒకే ఇంట్లో ఉంటారు. ఇక నాగచైతన్య సమంత కూడా పెళ్లి అయ్యాక నాగార్జున ఇంటి నుండి వేరుపడి మురళీ మోహన్ ఎంతో ప్రేమగా కట్టుకున్న ఫ్లాట్ ని కొనుక్కున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా పెళ్లికి రెడీ అయిన శోభిత ధూళిపాళ్ల నాగచైతన్యలు కూడా పెళ్లయ్యాక నాగార్జున నుండి వేరుపడి వేరు కాపురం పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సమంత నాగచైతన్య పెళ్లయ్యాక వారిద్దరూ హైదరాబాదులోనే ఉన్నప్పటికీ శోభిత మాత్రం నాగచైతన్యను హైదరాబాద్లో కాదు ముంబైకి తీసుకు వెళ్లబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ టాక్ వినిపిస్తోంది.

అయితే శోభిత దూళిపాళ్లకి తెలుగులో కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే అవకాశాలు వస్తున్నాయట  ఈ నేపథ్యంలోనే కొత్తగా పెళ్లయ్యాక భర్తని వదిలి ఉండడం ఇష్టం లేక నాగచైతన్యను కూడా ముంబైకి తీసుకువెళ్లి హైదరాబాద్ ను పూర్తిగా వదిలేసి ముంబైకి మకాం మార్చబోతున్నట్లు తెలుస్తోంది.ఇక నాగచైతన్యకు షూటింగ్స్ ఉంటే ఆయన ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చి షూటింగ్ అయిపోయాక తిరిగి ముంబైకి రావాలనే కండిషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. మరి శోభిత ధూళిపాళ్ల నిర్ణయం ప్రకారం నాగచైతన్య కూడా పెళ్లయ్యాక ముంబైకి వెళ్తారా.. లేక శోభితనే భర్త కోసం హైదరాబాదులో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: