ఇప్పుడు తెలుగు జనాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాలు కూడా అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే మూవీనే.  ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ..మహేష్ బాబుతో ఒక సినిమాకి  కమిట్ అయిన విషయం మనందరికీ తెలుసు . ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాలి . కానీ కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతూ వస్తుంది .


డిసెంబర్ నెల ఆఖరిలో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతున్నట్లు ఒక క్రేజీ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించి వార్తలు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మ్యాటర్స్ బయటకు వస్తూ ఉంటాయి .మరి ముఖ్యంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . వాళ్లలో ఒక లేడీ విలన్ కూడా ఉంది అంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.



రీసెంట్గా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు రాజమౌళి మాట్లాడుతూ మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాపై మైండ్ బ్లాక్ అయ్యే విషయాన్ని లీక్ చేశాడు . "ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అనిమల్స్ ని ఎక్కువగా ఉపయోగించారు కదా ..? నెక్స్ట్ సినిమాలో కూడా వాటిని వాడుతున్నారా..?" అని హోస్ట్ రాజమౌళిని అడగ్గా ..మొదట ఆన్సర్ ఇవ్వడానికి తట పటాయించారు. ఆ తర్వాత ఆన్సర్ ఇస్తూ .."ఆర్ఆర్ఆర్ చిత్రంలో కంటే అనిమల్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయి. మీరు ఆర్ఆర్ఆర్ లో చూసింది చాలా తక్కువ ..ఒకటో రెండో రకాల జంతువులనే చూశారు.  అయితే మహేష్ బాబు సినిమాలో మాత్రం కొన్ని వందల రకాల జంతువులను చూడబోతున్నారు. మరి ముఖ్యంగా  ఈ సినిమా చిన్న పిల్లలకు కూడా బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది "అని చెప్పుకొచ్చారు . ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా మహేష్ బాబు తెరకెక్కించే మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతుంది అంటూ బాగా ప్రచారం జరుగుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: