ఈ మధ్యకాలంలో నయనతారపై ఎలాంటి బూతు కామెంట్స్ ఉపయోగించారో జనాలు మనం చూసాం. మరే ముఖ్యంగా పెళ్లి తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయిన నయనతార సినిమాలకు మాత్రం చాలా ఎక్కువుగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని ఒక్కొక్క సినిమాకి దాదాపు 10 కోట్లు ఛార్జ్ చేస్తుంది అని వార్తలు వినిపించాయి. అంతేకాదు తెలుగు సినిమాల హీరోలతో నటించకూడదు అంటూ క్రేజీ కండిషన్ కూడా పెట్టుకుందట . దానికి కారణం తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తూ ఉండడమే అంటూ కూడా ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయింది .


అంతేకాదు నయనతార ఏకంగా చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేసింది అని ఓ న్యుస్ బాగా వైరల్ గా మారింది . బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభర.  నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నే అనుకున్నారట.  కానీ ఆమె రెమ్యూనరేషన్ పరంగా ఎక్కడ తగ్గకపోవడంతో మేకర్స్ త్రిష ను అప్రోచ్ అయ్యి ఆమెను ఈ సినిమాకి ఫైనలైజ్ చేశారట . అయితే రీసెంట్ గా నయనతార ఒకే ఒక్క పోస్టుతో తన పేరుకి మళ్ళీ పునర్ వైభవం అందుకునేలా చేసుకుంది.



నయనతార పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . "నేను రౌడీనే" సినిమాలో నయనతార - విజయ్ సేతుపతి జంటగా కలిసి నటించారు . విగ్నేశ్ శివన్  దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . నయనతారకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యేలా చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.



 ఈ సినిమా రిలీజ్ అయ్యి తొమ్మిదేళ్లు పూర్తి కావడంతో నయనతార ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. " నా జీవితాన్నే శాశ్వతంగా మార్చేసిన సినిమా ఇదే . నా కెరియర్ను అలాగే నా లైఫ్ ని పూర్తిగా మార్చేసింది .మర్చిపోలేని హిట్ నా ఖాతాలో వేయడమే కాకుండా మంచి భర్తని కూడా ఇచ్చింది. ఈ విషయంలో ఎప్పుడూ నేను  ప్రేక్షకులకు రుణపడి ఉంటాను . ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు విగ్నేశ్ శివన్ కి థాంక్స్" అంటూ రాసుకొచ్చింది . ఈ సినిమా చేస్తున్న టైంలోనే విగ్నేశ్ శివన్ - నయనతార ప్రేమలో పడ్డారు . ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేసి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళకి ఇద్దరు ట్విన్స్ కుమారులు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: