మలయాళ భామ నిత్యమీనన్ గురించి జనాలకు తెలిసిందే. ఈ బొద్దుగుమ్మ కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ, సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవల జరిగిన 70వ జాతీయ సిల్వర్ స్క్రీన్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా అవార్డును తగ్గించుకున్న నిత్యమీన‌న్‌.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గతాన్ని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ కలగనలేదు. అదేవిధంగా నేను నటించే ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కూడా కోరుకోలేదు.. కానీ అది జరిగింది అంటూ డెస్టినీ, ఫేట్ గురించి చాలా పెద్ద పెద్ద మాటలే ఆడింది.

ఈ క్రమంలోనే సదరు యాంకర్... 'మీరు ఎక్కువ బాధపడే సంఘటనలు సినిమా పరిశ్రమలో ఉన్నాయా?' అని ప్రశ్నించగా, నిత్య మాట్లాడుతూ... "నేను ఎక్కువ బాధపడే సంఘటనలు లేవుగానీ, ఎక్కువ ఆశ్చర్యపోయే సంఘటనలు గురించి చెప్పమంటే తప్పకుండ చెబుతా! నేను మొదటి తెలుగు సినిమా చేసినపుడు, చాలామంది నన్ను బాడీ షేమింగ్ చేసారు. నేను లావుగా ఉంటానని, జుట్టు కూడా విచిత్రంగా ఉండేమిటి? అంటూ వ్యాఖ్యలు చేసేవారు. కానీ అపుడు నేను వాటిని పట్టించుకొనే దానిని కాదుగానీ, చాలా ఆశ్చర్యపోయేదానిని. ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని.. కానీ అలా మాట్లాడిన వారే ఇపుడు నా జుట్టు గురించి, చాలా వైరైటీగా ఉంది.. చాలా బావుంది!" అంటూ మాట్లాడడం ఇపుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.

కాగా ధ‌నుష్‌ హీరోగా.. నిత్యమీనన్, రాశి ఖ‌న్నా ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ 'తిరుచిట్రంబళం' 2022లో రిలీజ్ అయ్యి, కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో తిరూ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాలో.. నిత్యమీనన్ పాత్రని తెలుగు ప్రేక్షకులను చాలా ఎంజాయ్ చేసారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. కాగా ఈ మూవీలో ఆమె అద్భుత నటనకు గాను నేషనల్ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆమె పాండిరాజ్‌ డైరెక్షన్లో విజయసేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: