ఇలియానా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తన నడుము అందచందాలకు ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ఇక ఈ బ్యూటీ ముంబైకి చెందిన అమ్మాయి. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అనంతరం పోకిరి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఇలియానాకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అతితక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ దక్కించుకున్న ఇలియానా అనంతరం తమిళం, హిందీలో వరుసగా సినిమాలను చేసింది.


2006లో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా చాలా కాలం పాటు వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు స్టార్ అగ్ర హీరోలు అందరి సరసన నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ వంటి ఎందరో స్టార్ హీరోల సరసన ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు చాలా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి తప్పకుంది. ఇదే విషయంపై లేటెస్ట్ గా సీనియర్ నిర్మాత కాంట్రాగడ్డ ప్రసాద్ ఇలియానాకి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టాడు.


తమిళంలో ఓ నిర్మాత వద్ద ఇలియానా పని చేస్తానని చెప్పిందట. ఈ తరుణంలోనే 40 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుందట. కానీ ఆ సినిమా ఇలియానా సినిమా చేయలేదట. నిర్మాత వచ్చి సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ కు కంప్లైంట్ ఇచ్చారని కాంట్రగడ్డ తెలియజేశారు. దీంతో కొన్నాళ్లపాటు ఇలియానాని బ్యాన్ చేశామని వెల్లడించారు. ఆ సమయంలో ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయితే కూడా ఆ నిర్మాతలతో మాట్లాడి సినిమా క్యాన్సిల్ చేయించామని కాంట్రగడ్డ తెలియజేశారు. దీంతో స్నేహితులు తర్వాత ఇలియానా సౌత్ లో సినిమాలు చేయలేదని తెలియజేశారు.


మరో నిర్మాత ఇలియానాతో సినిమా చేస్తామని వస్తే ఆ నిర్మాతకు 40 లక్షలు కట్టి ఆమెను తీసుకోండి అని చెప్పినట్టు తెలియజేశాడు. దీనివల్ల ఇలియానా చాలా ఇబ్బంది పెట్టిందని ఆ నిర్మాతను మోసం చేసిందని కాంట్రగడ్డ ప్రసాద్ తెలియజేశాడు. ఆయన గతంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కి అధ్యక్షుడిగా చేశాడు. ప్రస్తుతం ఇలియానాకు సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: