రమ్యశ్రీ.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, వాంప్ రోల్స్‌, బోల్డ్ క్యారెక్టర్ యాక్టర్ రమ్యశ్రీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన హాట్ హాట్ అందాల ఆరబోతతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్య శ్రీ. వాస్తవానికి ఈ హాట్ బ్యూటీ .. హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. కానీ, అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అయినా.. సరైన గుర్తింపు రాకపోవడంతో బోల్డ్ క్యారెక్టర్స్, బీ గ్రేడ్ పాత్రలో నటించి ఫేమస్ అయింది.1970లో ఏపీలోని విశాఖపట్నంలో జన్మించిన రమ్య శ్రీ.. 1997లో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
రమ్య శ్రీ తెలుగు అమ్మాయి అయినా.. కన్నడ ఇండస్ట్రీలో తొలుత నటించింది. కోలివుడ్ లో ఆమె దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా సరైన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. కన్నడ, తమిళ, మళయాలం, హిందీ, భోజ్ పురి భాషలలో దాదాపు 250 సినిమాల్లో నటించింది ఈ హాట్ బ్యూటీ. తెలుగు లో నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ వంటి పలు చిత్రాల్లో నటించింది.అలాగే అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. చాలా కాలంగా సినిమా లకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రమ్య శ్రీ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పటికీ.. ఇప్పటికీ ఏమాత్రం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలావుండగా రమ్యశ్రీ ఎక్కువగా శృంగార పాత్రల్లో నటించడంతో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.నటనలోనే కాకుండా స్క్రీన్‌ప్లే, దర్శకత్వ రంగాల్లో కూడా తనకు అనుభవం ఉంది. నటనకు, దర్శకత్వానికి పలు అవార్డులు కూడా లభించాయి. అయితే.. సినిమాలు చేయడం మానేశారో? లేదా అవకాశాలు రావడం లేదో .. లేదా? తెలియదు గానీ, ప్రస్తుతం రమ్యశ్రీ అంతగా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: