తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. మహేష్ ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే మహేష్ తన తదుపరి మూవీని గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ యొక్క షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే మహేష్ బాబు కొన్ని సంవత్సరాలు క్రితం ఒక్కడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. భూమిక చావ్లా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... గుణశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా .? ఆ అమ్మాయి పేరు నిహారిక. ఇకపోతే నిహారిక కి ఒక్కడు సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఒక్కడు మూవీ కంటే ముందు ఈమె మోహన్ బాబు హీరోగా రూపొందిన యమ జాతకుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన ప్రేమించుకుందాం రా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఒక్కడు మూవీ కంటే ముందు కొన్ని సినిమాల్లో ఈమె నటించిన ఒక్కడు సినిమాలోని పాత్ర ద్వారా నిహారిక కు మంచి గుర్తింపు లభించింది.

ఒక్కడు సినిమా తర్వాత ఈమెకు అనేక అవకాశాలు వచ్చినా కూడా ఈమె మాత్రం చదువుపై దృష్టి పెట్టి సినిమాలకు దూరంగా ఉంది. ఒక్కడు మూవీ తర్వాత ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇది ఇలా ఉంటే పొలిటికల్ ఫ్యామిలీ కి చెందిన ఓ అబ్బాయిని నిహారిక పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్ళకి ఇద్దరు పిల్లలు. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: