టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ తో సినిమా తెరకెక్కించడానికి టాప్ డైరెక్టర్లు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఒక డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారట. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో నటించడానికి ప్రభాస్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారట.
 
ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్లలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు కావడం గమనార్హం. ప్రభాస్ కల రాబోయే రోజుల్లో నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ నుంచి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా ఈ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ప్రభాస్ సినిమాల ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూనే ఈ రేంజ్ లో రికార్డిలు క్రియేట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ తనపై కొంతమంది విమర్శలు చేసినా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ప్రభాస్ యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ మారుతి కాంబో మూవీ ది రాజాసాబ్ ప్రమోషన్స్ మొదలు కావడం ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.


ది రాజాసాబ్ మూవీ 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఆడియో హక్కులు 25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ది రాజాసాబ్ సినిమా గ్లింప్స్, టీజర్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరైన ప్లానింగ్ తో ది రాజాసాబ్ ప్రమోషన్స్ జరగనున్నాయని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇతర సినిమాల అప్ డేట్స్ ఈరోజు వస్తాయో లేదో తెలియాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.







 




మరింత సమాచారం తెలుసుకోండి: