టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో లీనమై మరి నటిస్తూ ఉంటుంది. ఎక్కువగా సాయి పల్లవి నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలలో నటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ హీరో శివ కార్తికేయంతో కలిసి అమరన్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది.ఈ చిత్రం మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగానే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో మరొకసారి శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు.


ఇక సాయి పల్లవి రేబాక వర్గీస్ గా కనిపించబోతోందట. ఇటీవల ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయగా ట్రైలర్ లో కూడా సాయి పల్లవి తన నటనతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నది. ట్రైలర్ కూడా ఎక్స్లెంట్ గా ఉందని దేశభక్తి నిండిన సినిమాలు ఆడియన్స్ కి ఎప్పుడూ కూడా స్ఫూర్తినిచ్చేలాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. మేజర్ ముకుందన్ ఆర్మీలో తనని మ్యాడి అని పిలిచేవారట.. మ్యాడి అనే పదానికి అర్థం ఏమిటంటే తాను ఏదైనా చేయాలనుకుంటే కచ్చితంగా తన ప్రాణం పోయేవరకు ఆ పనిని వదిలిపెట్టడం.



ట్రైలర్ విషయానికి వస్తే మొదట మేజర్ ముకుందన్ తన కూతురితో ఆడుకుంటున్నటువంటి ఒక వీడియోను చూపించారు.. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించేశారు శివ కార్తికేయన్.. అయితే ఆర్మీ ఆఫీసర్ అనగానే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయాలను కూడా ఇందులో చూపించారు. ఆర్మీలో చేరిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా చాలా క్లియర్ గా చూపించారు. అలాగే మేజర్ ముకుందన్ తో వివాహమైన తర్వాత తన భార్యతో జరిగిన కొన్ని విషయాలను కూడా ఇందులో చూపించినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి మరొక హిట్ మూవీతో సాయి పల్లవి తన ఖాతాలు వేసుకోబోతుందని ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: