టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొంత కాలం క్రితం అలా వైకుంఠపురంలో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా 2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. మరి ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 44.88 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 18.27 కోట్లు , ఉత్తరాంధ్రలో 19.93 కోట్లు , ఈస్ట్ లో 11.44 కోట్లు , వెస్ట్ లో 8.96 కోట్లు , కృష్ణ లో 10.79 కోట్లు , గుంటూరులో 11.8 కోట్లు , నెల్లూరులో 4.72 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11.85 కోట్ల , ఓవర్ సీస్ లో 18.35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 160.37 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 160.37 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa