చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో విడాకులు బాటపడుతూ మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు అలా టాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్ ,మాలీవుడ్ ,బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ పద్ధతి పాకిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మలయాళ నటుడు మాత్రం డబ్బు కోసమే నాలుగో వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ నటుడు ఎవరు నిజంగానే డబ్బు కోసమే వివాహం చేసుకున్నారా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.


మలయాళ నటుడు బాల తాజాగా వివాహం చేసుకున్నారు. ఎర్నాకులంలో కలూర్ ఆలయంలో వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాల మేనమామ కూతురు కోకిలతో వివాహం జరిగినట్లు సమాచారం. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తాను వివాహం చేసుకోబోయే వారికి 250 కోట్ల రూపాయల ఆస్తి ఉందని వాటన్నిటిని తానే చూసుకోవాలని కూడా తెలియజేశారట. కానీ ఆ సమయంలో పెళ్లికూతురు ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదట.. అయితే నటుడు బాల తన మాజీ భార్యతో ఏర్పడిన ఒక గొడవ వల్ల ఇటీవలె చాలా వివాదాస్పదంగా మారారు. వివాహం చేసుకున్న తర్వాత బాలాకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.


బాల మొదటి విడాకుల గురించి ఒక యువతి బయట పెట్టింది.. బాల కుమార్ గారు చందన సదాశివ అనే ఒక కన్నడ అమ్మాయిని ప్రేమించి మరి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి .. ఆ 19 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకోవడం కరెక్టేనా అంటూ ఆమె ప్రశ్నించింది.. అంతేకాకుండా మాజీ భార్యతో విడిపోయి మూడో పెళ్లి చేసుకున్న ఆ ఎలిజిబెత్ ఎక్కడ అంటూ ప్రశ్నించింది. అయితే నటుడు బాలాకి సంబంధించి మొదటి పెళ్లి ఇంకా కోర్టులోనే కొనసాగుతున్నదట.ఇది 2008లో జరిగిందట. ఆ తర్వాత 2010లో గాయని అమృత సురేష్ ని వివాహం చేసుకోగా.. 2019లో విడాకులు తీసుకున్నారు.. అలా ఇప్పుడు ఏకంగా నాలుగవ పెళ్లి చేసుకుని హార్ట్ టాపిక్ గా మారిపోయారు నటుడు బాల.

మరింత సమాచారం తెలుసుకోండి: