ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా చాలానే సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల ఏ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు. కొన్ని సినిమాలు చాలా తొందరగానే బాక్స్ ఆఫీస్ రన్ ను ముగించుకొని సైలెంట్ కాక , ఓ రెండు సినిమాలు మాత్రం ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం ఆపసోపాలు పడుతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? వాటి వివరాలను తెలుసుకుందాం.

ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11 వ తేదీన గోపీచంద్ హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం మూవీ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ శివప్రసాద్ నిర్మించాడు. ఈ మూవీ కి విడుదల అయిన రోజే మిక్స్ డ్ వచ్చింది. కానీ ఈ మూవీ ఇప్పటికీ కూడా పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటివరకు హిట్ స్టేటస్ ను అందుకొని ఈ సినిమా హిట్ కి మాత్రం చాలా దగ్గరగా వచ్చింది. ఈ సినిమా కనుక మరో వారం రోజుల పాటు ప్రస్తుతం వస్తున్న రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడితే హిట్ ను అందుకునే అవకాశాలు ఉన్నాయి. 

ఇకపోతే అక్టోబర్ 10 వ తేదీన తమిళ నటుడు రజినీ కాంత్ హీరోగా రూపొందిన వెట్టయన్ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు కూడా మిక్స్ డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ కి కూడా పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ సినిమా కూడా హిట్టు స్టేటస్ కి దగ్గర గానే వచ్చింది. మరి ఈ మూవీ కి కూడా మరో వారం రోజుల పాటు పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లు దక్కితే హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఈ రెండు సినిమాలు కూడా హిట్ కోసం ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అష్ట కష్టాలు పడుతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc