నాగచైతన్య తీసుకున్న నిర్ణయం ..ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అసలకే నాగచైతన్య పై సమంత ఫ్యాన్స్ పీకల్లోతు కోపంలో ఉన్నారు. సమంతని నమ్మించి మోసం చేశాడు అని చాలామంది బాధపడిపోతున్నారు . అదే స్ధాయిలో బూతులు కూడా తిడుతున్నారు. సమంత అంటే నిజంగా ప్రేమ ఉంటే అసలు రెండో పెళ్లికి వెళ్లనే వెళ్లకూడదు అంటూ ఎంతో మంది ఓపెన్ గా మాట్లాడిన విషయం తెలిసిందే .


అయితే వాటిని పెద్దగా కేర్ చేయని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకొని మరికొద్ది రోజుల్లోనే ఆమె మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు . వీళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు కూడా అన్ని చకచకా పూర్తి చేసేసుకుంటున్నారు అక్కినేని ఫ్యామిలీ . అందుతున్న సమాచారం ప్రకారం .. డిసెంబర్ 4వ తేదీ వీళ్ల పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది . అయితే శోభితపై ఉన్న పిచ్చి ప్రేమతో నాగచైతన్య ఆమె ఏమి చెప్తే అది వింటున్నాడు అంటూ ఓ న్యుస్ బాగా ట్రెండ్ అవుతుంది.



మరి ముఖ్యంగా గతంలో సమంతకి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ వస్తూ ఉండగా ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్దాము .. ముంబైలో సెటిల్ అవుదాము అంటూ నాగచైతన్య కు చెప్పగా..  ఎంత నచ్చజెప్పిన అస్సలు వినలేదట నాగచైతన్య. అయితే శోభిత ధూళిపాళ్ల ముంబైలో సెటిల్ అవుతాము అక్కడ నీకు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పగానే ఆమె మాటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట .త్వరలోనే పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ్లతో ముంబైలో సెటిల్ కాబోతున్నాడు నాగచైతన్య అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఆశ్చర్యం ఏంటంటే దీనికి నాగార్జున కూడా ఒప్పుకున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. శోభిత పై పిచ్చి ప్రేమతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు నాగచైతన్య అంటూ సమంత ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు . అసలు నాగచైతన్య ఈ డెసీషన్ ఎందుకు తీసుకున్నాడు అనేది ఆయనకే తెలియాలి..???

మరింత సమాచారం తెలుసుకోండి: