మన సౌత్ చిత్ర పరిశ్రమ లో అనుకుంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ల లో నదియా కూడా ఒకరు . ఒకప్పుడు తెలుగు తమిళం లో వరుస‌ సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ సీనియర్ బ్యూటీ .. తర్వాత పెళ్లి చేసుకు ని సినిమాల కు దూరమైంది .. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న నదియా.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది .  ప్రభాస్ కు తల్లి పాత్ర లో నటించి తెలుగు ప్రేక్షకుల ను మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో మరోసారి టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా గడుపుతుంది.


అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన అత్తారింటికి దారేది సినిమా లో పవన్ అత్త పాత్రలో నటించిన నదియా .. ఈ సినిమాకు గాను ఆమె నంది అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో మరింత క్రేజ్ ను పెంచుకుంది . అలా వరుస ఆఫర్స్ రావడంతో త‌ల్లి పాత్రలే కాకుండా నెగిటివ్ , సీరియస్ రోల్స్ లో కూడా  నటిస్తుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు గా  బిజీగా కొనసాగుతుంది . అయితే ఇప్పుడు తాజా గా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్గా ఉండే నదియా ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి .. అందులో ఆమె కూతుర్లు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారారు.


త‌ల్లి పాత్రలు పోషిస్తున్న నదియా.. ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. అలాగే ఆమె కూతుళ్లు కూడా తరగని అందంతో కట్టిపడేస్తున్నారు. ఇంతకీ నదియా కూతుళ్లను ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నయి. ఆ ఫోటోలలో ఇద్దరు కూతుర్లు తల్లిని మించిపోయే అందంతో సెగ‌లు రేపుతున్నారు. త్వరలోనే హీరోయిన్గా కూడా వీళ్లు అడుగుపెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: