సాయి పల్లవి ఈ హీరోయిన్ గురించి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవి తెలుగులో వరసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. అగ్ర హీరోల సరసన నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.


ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ సరసన అమరన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. తాను ఎంబిబిఎస్ చేయడానికి జార్జీయా వెళ్లిన తాను టాంగో డాన్స్ కోసం పొట్టి బట్టలు వేసుకున్నానని సాయి పల్లవి చెప్పింది.


కానీ ప్రేమమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాత వీడియో వైరల్ అయిందని చెప్పింది. దీంతో ఆ పాత వీడియోలను చూసి చాలామంది సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రోల్స్, కామెంట్లు చేశారని సాయి పల్లవి బాధపడింది. వాటిని చూసి తనకు చాలా బాధ కలిగిందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఆ సమయం నుంచి పోట్టి బట్టలు వేసుకోవద్దని నిర్ణయించుకున్నానని చెప్పింది.


బట్టల విషయంలో నిర్ణయం తీసుకున్నారని తెలియజేసింది సాయి పల్లవి. తప్పనిసరిగా ఆ నియమాన్ని పాటించాలని తనకు తాను నిబంధనను సాయి పల్లవి పెట్టుకుందట. దానివల్ల తనకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినట్లుగా సాయి పల్లవి వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా చేస్తున్న తండేల్ సినిమాలో సాయి పల్లవి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: