ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆఖరుగా అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతుంది.

సినిమా రెండవ భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ ఎత్తున పారితోషకాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్సినిమా కోసం అంత తీసుకున్నాడు ... ఇంతా తీసుకున్నాడు అని అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్సినిమా కోసం 100 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతుండగా ... ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 3 సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు.

అందుకోసం ఆయన 200 వందల కోట్ల పారితోషకాన్ని తీసుకున్నాడు అని మరో వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా కలెక్షన్లలో 27 శాతం ప్రాఫిట్ గా పారితోషకం కింద అల్లు అర్జున్ తీసుకోనున్నాడు అని మరో వార్త వైరల్ అవుతుంది. ఇలా అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" పారితోషకం కు సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa