నందమూరి బాలకృష్ణ నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు పూర్తి అవుతుంది. కానీ చాలా సంవత్సరాల పాటు బాలకృష్ణ సినిమాల మీద తప్పితే వేరే ఏ విషయంపై కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అలా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను ముందుకు సాగించాడు. ఇక కొంత కాలం క్రితమే బాలకృష్ణ ఆహా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న మొదటి టాక్ షో అయినప్పటికీ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఈ టాక్ షో ను అదిరిపోయే రేంజ్ విజయం సాధించేలా చేశాడు. ఇప్పటికే ఈ టాక్ షో కి సంబంధించిన మూడు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి.

మరికొన్ని రోజుల్లోనే నాలుగువ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే నాలుగవ సీజన్ కి సంబంధించిన కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ కూడా పూర్తి అయింది. నాలుగవ సీజన్లో మొదటి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు తో ప్రారంభం కానుంది. ఈ ఎపిసోడ్ ను ఈ రోజు అనగా అక్టోబర్ 25 వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇకపోతే ఈ టాక్ షో మొదలైనప్పటినుండి మెగాస్టార్ చిరంజీవి ఈ టాక్ షో కు రాబోతున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతూనే ఉంది. కానీ ఇప్పటివరకు చిరంజీవి మాత్రం ఈ టాక్ షో కు రాలేదు.

ఇక చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ మాత్రం ఆన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఒక ఎపిసోడ్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. చరణ్ ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆన్ స్టాపబుల్ షో కి రానున్నట్లు ఆ ఎపిసోడ్ కి సంబంధించిన చిత్రీకరణ మరి కొంత కాలం లోనే జరగనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: