టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్గా రూపొందిన అర్జున్ రెడ్డి అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఈ దర్శకుడు అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశాడు. ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈయనకు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఇకపోతే ఈ దర్శకుడు కొంత కాలం క్రితం రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా యానిమల్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఇప్పటికే అద్భుతమైన స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు తన కెరియర్ ప్రారంభంలో ఓ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు అనే విషయం మీకు తెలుసా ..? అసలు విషయం లోకి వెళితే ... సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించక ముందు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన కేడి అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడట.

ఇకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ లో నాగార్జున కు జోడిగా మమత మోహన్ దాస్ నటించింది. సందీప్ రెడ్డి వంగ తన తదుపరి మూవీ ని ప్రభాస్ తో చేయబోతున్నాడు. ప్రభాస్ హీరో గా ఈయన స్పిరిట్ అనే మూవీ ని రూపొందించనున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడి ఇప్పటికే చాలా కాలమే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Srv