అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న తదుపరి చిత్రం పుష్ప-2. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీని చాలాసార్లు మార్పులు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యేది. అయితే షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.

కానీ ఇప్పుడు మళ్లీ ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. తాజాగా ఈ విషయాన్ని పుష్ప2 మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా విడుదల తేదీని డిసెంబర్ 5న తేదీకి మార్చారు. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసుకోకుండా సుకుమార్ ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని వార్తలు వస్తున్నాయి.


ఇదిలా ఉండగా.... ప్రస్తుతం పుష్ప టు సినిమాకు అల్లు అర్జున్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నటించినందుకు అల్లు అర్జున్ ఏకంగా రూ. 100 కోట్లు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మూడేళ్ల సమయాన్ని కేటాయించడం వల్ల ఇంత మొత్తంలో తీసుకున్నాడని అంటున్నారు.


ఇక అల్లు అర్జున్ తీసుకుంది చాలా తక్కువేనని మూడేళ్ల కాలానికి గాను రూ. 200 కోట్లకు పైనే తీసుకొని ఉంటారని మరికొందరు అంటున్నారు. లేదంటే సినిమా కలెక్షన్లలో 27% ప్రాఫిట్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: