సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా కొన్ని సంవత్సరాల క్రితం భారత మాజీ క్రికెటర్ ధోని జీవిత కథ ఆధారంగా ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ధోని జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ ద్వారా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే ఈ మూవీ లో హీరోయిన్గా నటించిన కియారా అద్వాని కి కూడా అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్గా మొదట అవకాశం కియార అద్వానీ కి కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కి వచ్చిందట. కానీ ఆ ముద్దు గుమ్మ మాత్రం ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఒకానొక ఇంటర్వ్యూ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ... హిందీ సినిమా అయినటువంటి ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ పాత్రకి మొదట నన్నే సంప్రదించారు. ఇక నేను ఆ సమయంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న బ్రూస్ లీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాను. ఆ సినిమాకు సంబంధించిన పనులు చాలా వరకు పూర్తి అయిన రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.

ఇక ఆ సినిమా షూటింగ్ ఈ సినిమా పాటల చిత్రీకరణ రెండు ఒకే సమయంలో ఉండడంతో నేను ఆ సినిమాను రిజెక్ట్ చేయవలసి వచ్చింది అని రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: