టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు , ప్రభాస్ కూడా ఉంటారు. ఇకపోతే ఓ దర్శకుడు మహేష్ బాబు కు అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను ఇస్తే ప్రభాస్ కి మాత్రం ఫ్లాప్ లను ఇచ్చాడు. ఆ దర్శకుడు ఎవరు అనే వివరాలు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మొదటగా పోకిరి అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని రూపొందించాడు. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో బిజినెస్ మాన్ అనే సినిమా వచ్చింది. పోకిరి కాంబోలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే పూరి జగన్నాథ్ , ప్రభాస్ తో మొదటగా ఏక్ నిరంజన్ అనే సినిమాను రూపొందించాడు. ప్రభాస్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక బుజ్జిగాడు సినిమా తర్వాత చాలా తక్కువ గ్యాప్ లోనే పూరి జగన్నాథ్ , ప్రభాస్ తో ఏక్ నిరంజన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ ధియేటర్లలో విడుదల అయింది. కానీ ఈ సినిమా బుజ్జిగాడు సినిమా కంటే దారుణమైన అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా మహేష్ బాబుకు రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందించిన పూరి జగన్నాథ్ , ప్రభాస్ కి మాత్రం రెండు అపజయాలను అందించాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: