ఇప్పుడు దేవర సినిమా అనగానే టాలీవుడ్ లో ముందుగా గుర్తుకొచ్చేవి ఏంటి అంటే..? ఎన్టీఆర్ నటన , కలెక్షన్లో లేదా పాటలు , సినిమాలో య‌క్ష‌న్‌ సీన్స్ అనుకుంటారు కానీ అది కావు డిజాస్టర్ అనే టాక్.. దేవర సినిమాను కావాలని ట్రోల్ చేసి సినిమా బాగున్న బాగోలేదంటూ.. పాద ఘట్టం 2  సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఎక్కారు  మెగా ఫాన్స్.. తీరా సినిమాను ఎందుకు ట్రోల్ చేశారో కూడా చాలా మందికి వారికే తెలియదు.. కోపం కొర‌టాల శివ పై మరి ఎన్టీఆర్‌ను ఎందుకు టార్గెట్ చేశారంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు.


దేవర సినిమాను ప్రతి విషయంలోనూ సీరియస్ గానే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ను అమ్మేయడం వెనక దేవర సినిమా కారణం అంటూ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు అసలు ఏమాత్రం బజ్ లేదని కొరటాల శివ పని అయిపోయిందని.. రాజమౌళి సెంటిమెంట్  ను కూడా బ్రేక్ చేయలేక పోయారంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల కామెంట్లు పెట్టారు. కానీ అవి ఏ మాత్రం పట్టించుకోకుండా దేవ‌ర‌కి కలెక్షన్స్ సునామి సృష్టించి వారి నోళ్లను మూసింది. సినిమాను ఏ రేంజ్ లో టార్గెట్ చేసిన దేవర ఏం చేయాలో అది చేసి చూపించింది.


ఇక సినిమాపై ఉన్న అంచనాలకు మించి కలెక్షన్స్ రావడంతో అందరూ ఒక్కసారిగా అదిరిపోయారు. సినిమా మౌత్ టాక్ తో దాదాపు 20 రోజులు పాటు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది. అయితే ఇక్కడ దేవరను ఏ సంబంధం లేకపోయినా ప్రభాస్ అభిమానులు కూడా ట్రోల్ చేయడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. ఎన్టీఆర్ రికార్డులన్నీ ఫేక్ అంటూ ప్రభాస్ అభిమానులు ట్రోల్ చేశారు. ఇక స‌లార్ కల్కి సినిమాల రికార్డులను దేవర బద్దలు కొట్టిందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లెక్కలతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన రాజాసాబ్ పోస్టర్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లు ఉన్నాయని, గుడుంబా తాగినట్టు ప్రభాస్ కళ్ళు ఉన్నాయని… ఇక ప్రభాస్ సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఒక్క షో కూడా ఫిల్ కాలేదని, హౌస్ ఫుల్ అయినట్టు చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని ప్రభాస్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక రాజాసాబ్ రిలీజ్ టైం కి ఈ ట్రోలింగ్ ఎలా ఉంటుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: