బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ముంబై  గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నూంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అతనికి భారీ సెక్యూరిటీని కూడా కల్పించింది. సినిమా షూటింగ్ కు వచ్చే సమయంలో కూడా సెక్యూరిటీతో వస్తున్న సల్మాన్ తనతో పాటు తనతో నటించే నటీనటుకులు కూడా అదే స్థాయిలో సెక్యూరిటీని ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం మురగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో సికిందర్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అలాగే హీందిలో బిగ్ బాస్18 కు హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. తాను ఎక్కడికి వెళ్లినా భారీ బందోబస్తు సల్మాన్ కనిపిస్తున్నాడు.


ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం సల్మాన్ సింగం రిటర్న్స్ మూవీలో అతిథి పాత్రలో నటించినందుకు అజయ్ దేవగన్ ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సల్మాన్ ఖాన్ - రష్మికకు ప్రత్యేక సెక్యూరిటీని కల్పించాడు. ముంబైలో సికిందర్ సినిమా ఎన్ని రోజులు షూటింగ్ జరుపుకుంటే అన్ని రోజులు తన స్పెషల్ గెస్ట్ హౌస్ లో ఆమెకు ప్రత్యేక అతిథి మర్యాదలు చేయబోతున్నాడట. ఆమెకు ఎటువంటి అసౌక‌ర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఆమెకు భయం అనే పరిస్థితి రాకుండా ఏర్పాటు చేయబోతున్నారట.


సల్మాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరంపులు రావటంతో తనతో పాటు రష్మిక కూడా హీరోయిన్గా నటిస్తుంది కాబట్టి ఆమెకు కూడా బెదిరింపులు వచ్చే అవకాశం ఉందని సల్మాన్ భావించి ఈ జాగ్రత్తలు తీసుకున్నారట. ఆ గ్యాంగ్ అమెను కిడ్నాప్ చేసీ బెదిరించే అవకాశం ఉండటంతో ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. ఇక దీంతో రష్మిక చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూసి ఎందుకు ఆమెకి అంత సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.. ఏమైనా ప్రాణ భయం ఉందా ? ఎవరైనా చంప‌లనుకుంటున్నారా ? అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. చివరికి అసలు విషయం తెలియడంతో సల్మాన్ ఖాన్ కు రష్మిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంది. సికిందర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని లక్ష్యంతో సల్మాన్ - మురగదాస్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: