ద‌ర్శక ధీరుడు రాజమౌళి మహేష్ సినిమా కోసం కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాడు. మహేష్ సినిమాని మొదలు పెట్టడానికి ముందే మరింత అప్డేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.. తాను చేయాల్సిన సినిమాని పక్కన పెట్టి మరీ జక్కన్న అది నేర్చుకుంటున్నాడు. రాజమౌళి నేర్చుకుంటున్న కొత్త పాటలు ఏంటి? త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటిపోయిన రాజమౌళి తన తర్వాత సినిమాను ఇంకా సెట్స్ మీదకు తీసుకురాలేదు. మహేష్ బాబు తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న. ఇది ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుందన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఈ సమయంలో ఏఐ ట్రైనింగ్ తీసుకునేందుకు రాజమౌళి రెడీ అయ్యారు.


ఇక తన అన్ని పనులు పక్కనపెట్టి ఈ లేటెస్ట్ టెక్నాలజీ గురించి క్లాసులు తీసుకుంటున్నాడు. ఇక తెలుగు సినిమాను టెక్నికల్ గా టాప్ రేంజ్ కు తీసుకువెళ్ళీన  ఘనత కూడా రాజమౌళి ఇదే .  సినిమాల్లో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ను వాడటం మొదలు పెట్టింది కూడా రాజమౌళినే ఇప్పుడు కొత్తగా ఏఐ  ట్రైనింగ్ తీసుకోవడంలో జ‌క్కన్న ఏం చేయబోతున్నారన్నది అందరిలో ఆసక్తికరంగా మారింది.  ప్రస్తుతం సినిమాలో గ్రాఫిక్స్ వినియోగం భారీగా పెరిగింది కొన్ని సినిమాల్లో చనిపోయిన ఆర్టిస్టులు కూడా తేర మీద చూపిస్తున్నారు .. అందుకే రాజమౌళి కూడా అలాంటి ప్లానింగ్ ఏదైనా చేస్తున్నారన్న డిస్కషన్ మొదలైంది.  


ఇక గతంలో యమదొంగ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌ను తెర మీద చూపించిన జక్కన్న ఈసారి మహేష్ బాబు , సూపర్ స్టార్ కృష్ణ ను ఒకే ఫ్రేమ్లో చూపిస్తారా అన్న డౌట్ మొదలైంది . ఇక మహేష్ తో చేయబోయేది అడ్వెంచర్ యాక్షన్ డ్రామా కాబట్టి గతంలో కృష్ణ చేసిన మోసగాళ్లకు మోసగాడు లాంటి సినిమాలోని పాత్రను మళ్ళీ రిక్రియేట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంలో రాజమౌళి ప్లానింగ్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్ర‌క‌ట‌న‌ వస్తే మాత్రం దీనిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: