తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న రష్మిక మందన్నా ఇప్పుడు బాలీవుడ్, హిందీ సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. ‘గీత గోవిందం’, ‘డీర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ పుష్ప మూవీతో తన కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక అందులో శ్రీవల్లి పాత్రలో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను  కట్టిపడేసింది. ఇక పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల రష్మిక కు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. 

బాలీవుడ్‌ లో స్థిరపడాలనే ఆశతో ఆమె అక్కడ ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది. ఇక హిందీ సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు లభించడంతో కొత్త కొత్త ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్మిక పుష్ప 2, యానిమల్ 2 చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక కొత్త డౌట్ మొదలైంది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 మూవీ తర్వాత వరుసగా హిందీ, తమిళ్ సినిమాలను లైనప్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత రష్మిక తెలుగు సినిమాలకు దూరం అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 ఈ వార్త ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదు. రష్మిక తన ఇంటర్వ్యూల్లో తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన అభిమానం ఉందని అవకాశం వస్తే తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తానని చెప్పింది. ఇకపోతే గతంలో చాలా మంది హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించి ఆతర్వాత బాలీవుడ్ కు వెళ్లి తెలుగు సినిమాలను తగ్గిచేశారు. ఇప్పుడు రష్మిక కూడా తెలుగు సినిమాను తగ్గిస్తుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రష్మిక అభిమానులు మాత్రం అలా కాదు అని అంటున్నారు. ఇక ఈ విషయం పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: