బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం బుల్లితెరపైన దూసుకుపోతోంది. మిగతా షోలకంటే కూడా ఇదే మెండుగా నడవడంతో ప్రస్తుతం నిర్వాహకులు నెక్స్ట్ సీజన్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. కాగా ప్రస్తుతం ఇక్కడ బీబీ రాజ్యం టాస్క్ జరుపుకుంటోంది. రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ మధ్య జరుగుతున్న ఈ టాస్క్ లో భాగంగా బీబీ రాజ్యం లో హాస్పిటల్, వ్యవసాయానికి సంబంధించిన బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా గేమ్ మంచి రసవత్తరంగా నడుస్తోంది. ఇక ఈ ఆటలో భాగంగా బస్తాలు ఇస్తుంటే, వాటిని తమకు ఇచ్చిన చక్రాల బండి పేర్చాల్సి ఉంటుంది.

ఇకపోతే, ఈ టాస్క్ లో పాల్గొన్న నిఖిల్, పృధ్వి పైన అందరి దృష్టి మళ్లింది. ఓజీ క్లాన్ నుంచి వీరు ఇద్దరూ పోటీలో పాల్గొనగా... రాయల్ క్లాన్ నుంచి గౌతం, మెహబూబ్ మొదటి నాలుగు రౌండ్లు, ఆ తరువాత 4 రౌండ్లు రాయల్ క్లాన్ నుంచి గౌతం, మెహబూబ్ కి బదులుగా అవినాష్, తేజ రావడం జరిగింది. అయితే 8 రౌండ్లలో ఒక బ్యాగ్ ని ఇచ్చిన సమయంలో చక్రాల బండి మీద పెట్టలేకపోయారు. కానీ, మిగతా 7 బ్యాగ్ లు ఓజీ క్లాన్ వారే చాలా జాగ్రత్తగా బండిమీద పేర్చారు. కట్ చేస్తే, సో ఈ టాస్క్ లో ఓజీ క్లాన్ విజేతగా నిలిచింది.

ఇక ఈ టాస్క్ గెలిచిన సందర్భంగా ఓజీ క్లాన్ నుంచి పృధ్విని మెగా చీఫ్ కంటెండర్ గా ఎంపిక చేయడం జరిగింది. మరోవైపు గౌతంని మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇక నెక్స్ట్ రౌండ్లో  బిగ్ బాస్ వైరస్, డిఫెన్స్ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ లో కూడా ఓజీ క్లాన్ నుంచి వచ్చిన నిఖిల్, నబీల్ లు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో వీరిది మంచి జోడీ అని తేలిపోయింది. దాంతో ఈసారి కూడా ఓజీ క్లాన్ నుంచి నిఖిల్ మెగా చీఫ్ కంటెండర్ గా ఎంపిక చేయగా రాయల్ క్లాన్ నుంచి గంగవ్వని చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించడం జరిగింది. ఇక మరోవైపు బీబీ రాజ్యం టాస్క్ లో ఓజీ క్లాన్ మెంబర్స్ చాలా కసిగా ఆడుతున్నట్టు కనబడుతోంది. అంతేకాకుండా... ప్రస్తుతానికి టైటిల్ రేసులో ఉన్న ఒకరిద్దరిలో నిఖిల్ ఒకడు కాగా నిన్న పర్ఫార్మెన్స్ తో అతను ఆడియన్స్ మనసులు గెలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: