పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక కొంత కాలం క్రితం ఈ మూవీ నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమాకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్ స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఈ సినిమా తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన తేరి అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందుతుంది అని ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్న దశరథ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దశరథ్ కు మీరు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ రైటర్ గా పని చేస్తున్నారు. అది తేరి సినిమాకు రీమేక్ అని ఓ వార్త వైరల్ అవుతుంది అది నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది.

దానికి దశరథ్ సమాధానం చెబుతూ ... ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదు. అది ఒక మిస్ కమ్యూనికేషన్ వల్ల బయటకు వచ్చిన న్యూస్. ఆ సినిమాకు తేరి సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదు. కాకపోతే ఎందుకో ఆ న్యూస్ బయటకు వచ్చి వైరల్ అయింది. ఇది కొత్త కథతో రూపొందుతున్న సినిమా అని ఆయన చెప్పాడు. దీనితో ఇన్ని రోజుల పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తేరి మూవీ కి రీమేక్ అని డిసప్పాయింట్ అయిన పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: